నర్సాపూర్ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1571. ఇందులో పురుషులు 791, మహిళలు 780. గృహాల సంఖ్య 305. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1591. ఇందులో పురుషులు 793, మహిళలు 798. గృహాల సంఖ్య 324. అక్షరాస్యత శాతం 40.60%. గ్రామ కోడ్ సంఖ్య 575000. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా ముద్దప్ప ఎన్నికైనారు. విద్యాసంస్థలు: గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.
= = = = =
| |||||||||||
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి