పేరపళ్ళ మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఇక్కడ జాయమ్మ చెరువు ఉంది. ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. పేరపళ్ళలో గజాలమ్మ ఆలయం ఉంది. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. గ్రామ పరిధిలో మల్కన్వానికుంట చెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3779.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3334. ఇందులో పురుషులు 1663, మహిళలు 1671. గృహాల సంఖ్య 567. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3779. ఇందులో పురుషులు 1905, మహిళలు 1874. గృహాల సంఖ్య 626. అక్షరాస్యత శాతం 30.80%. గ్రామ కోడ్ సంఖ్య 575446. రాజకీయాలు: 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా గోవిందమ్మ ఎన్నికయ్యారు. నీటిపారుదల: గ్రామ పరిధిలో 31 ఎకరాల ఆయకట్టు ఉన్న మల్కన్వానికుంట చెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.
= = = = =
| |||||||||||

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి