ప్రముఖ సామాజిక మరియు గ్రామీణ స్వావలంబన ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు అయిన నానాజీ దేశ్ముఖ్ అసలుపేరు చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్. అక్టోబరు 11, 1916న ప్రస్తుత మహారాష్ట్రలోని హింగోళి జిల్లా కడీలిలో జన్మించిన నానాజీ దేశ్ముఖ్ విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాలలో కృషిచేసారు. ప్రముఖ ఆరెస్సెస్ కార్యకర్తగానూ, జనసంఘ్ పార్టీ స్థాపనలో ఒకరుగానూ ప్రసిద్ధి చెందారు. ఈయన సేవలకుగాను భారతప్రభుత్వం 1999లో పద్మభూషణ్ను, 2019లో దేశంలో అత్యున్నతమైన భారతరత్న(మరణానంతరం) పురస్కారాన్ని ప్రధానం చేసింది. దేశంలో తొలి గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని మరియు సరస్వతీ శిశుమందిరాన్ని స్థాపించిన ఘనత ఇతనిదే. లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన నానాజీ దేశ్ముఖ్ ఫిబ్రవరి 27, 2010న మరణించారు.
రాజకీయ జీవితం: ఆరెస్సెస్ ప్రచారకర్తగా ఉన్నా నానాజీ దేశ్ముఖ్ మహాత్మాగాంధీ హత్యానంతరం ఆరెస్సెస్ పై నిషేధం విధించడంతో ప్రచురణలకు కూడా ఆటంకంఖ్ కలిగింది. నిషేధం ఎత్తివేసిన పిదప జనసంఘ్ పార్టీ స్థాపనలో ఈయన కూడా ప్రముఖపాత్ర వహించారు. ఉత్తరప్రదేశ్లో జనసంఘ్ పార్టీ బలోపేతం కావడానికి చాలా కృషిచేశారు. 1967లో చరణ సింఘ్ మంత్రివర్గంలో జనసంఘ్ పార్టీ కూడా భాగస్వామి అయింది. 1975లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణతో కలిసి పనిచేశారు. 1977 లోక్సభ ఎన్నికలలో బలరాంపుర్ నుంచి ఎన్నికయ్యారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి