9, మార్చి 2019, శనివారం

మనిషా కోయిరాలా (Manisha Koirala)

జననంఆగస్టు 16, 1970
రంగంసినీనటి
అవార్డులుఫిలింఫేర్ అవార్డు
నేపాలీ మరియు బాలీవుడ్ సినీనటిగా పేరుపొందిన మనీషా కోయిరాలా ఆగస్టు 16, 1970న ఖాట్మండులో జన్మించింది. మనీషా కోయిరాలా తాత బిశ్వేశ్వర్ ప్రసాద్ కోయిరాలా నేపాల్ 22వ ప్రధానిగా పనిచేశారు. 1989లో Pheri Bhetaula నేపాలీ సినిమా ద్వారా మనీషా కోయిరాలా సినీరంగప్రవేశం చేసింది. ఈమె నటించిన తొలి బాలీవుడ్ సినిమా సౌదాగర్ (1991). 1994లో "1942: A Love Story" సినిమా ద్వారా కోయిరాలా పేరుపొందింది. కోయిరాలా తెలుగులో భారతీయుడు, క్రిమినల్ లాంటి సినిమాలలో కూడా నటించింది. 1999 & 2015లలో ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించబడింది.

పురస్కారాలు:
1996: ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు (తమిళం- బాంబే)
1997: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి అవార్డు (ఖామోషి)
2003: ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు (కంపెనీ)
2014: ఇండియా టుడే విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
2017: నవభారత్ టైమ్స్ అవార్డు

ఇవి కూడా చూడండి:


విభాగాలు: సినిమా నటులు, 


 = = = = =


Cinema Actress, Biography of Cinema Actress, About Manisha Koirala,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి