 |
| చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయం |
పాలమూరు జిల్లా
ధరూర్ మండలం చింతరేవులలో వెలిసిన పురాతన ఆలయమే చింతరేవుల ఆంజనేయస్వామిగా పిలువబడుతున్నది. సుమారు 750 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. గద్వాల సంస్థానాధీశులచే పరాభవం పొందిన శేషుదాసు అవమానభరితుడై నడక సాగిస్తూ అలసిపోయి ఈ ప్రాంతానికి వచ్చిన పిదప ఒక పుట్ట చూసి అందులో చేయివేసి పాముకాటుకు గురై మరణించదలిచాడు. మరో తొర్రలోంచి పాము వెళ్ళిపోయింది కాని కాటు పడలేదు.
 |
| శేషుదాసు |
అక్కడే చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకొనుచుండగా ఆంజనేయుడు కలలో కనిపించి నీవు ఆత్మహత్య చేసుకొనే అవసరం లేదు, నీ వల్ల ప్రజలకు మేలు జరుగునున్నది, ఈ పుట్టలో నేను దాగిఉన్నాను, నన్ను వెలికితీసి ఆలయం నిర్మించమని కోరగా, శేషుదాసు స్వామివారి ఆదేశం మేరకు పుట్టలోంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసి ఆలయం నిర్మించి రోజూ పూజలు చేస్తుండేవాడు. చింతరేవుల గ్రామానికి చెందిన ఒకవ్యక్తి ఇతనికి ఆహారం అందజేసేవాడు. ఆ తర్వాత స్వామి మరోమారు కలలో కనిపించి నీవు మల్డకల్ వెంకటేశ్వరస్వామి వద్దకు వెళ్ళినచో మంచికలుగును అని పలుకగా స్వామి ఆదేశం మేరకు శేషుదాసు అక్కడికి వెళ్ళి మహిమలు చూపిస్తూ భక్తులకు ఆకట్టుకున్నాడు. శేషజీవితం అక్కడే గడిపాడు. ఈ ఆంజనేయస్వామి ఆలయం పరిసరాలలో చింతచెట్లు అధికంగా ఉండుట వల్ల చింతరేవుల పేరు వచ్చినట్లు కథనం. ఇక్కడి మరో విశిష్టత ఏమిటంటే ఆలయ పరిసరాలలొ అర్చకులు తప్ప ఎవరూ ఉండకపోవడం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి