9, మే 2013, గురువారం

సురభి శేషశర్మ (Surabhi Shesha Sharma)

పాలమూరు జిల్లాకు చెందిన నిజాం వ్యతిరేక ఉద్యమకారులలో ప్రముఖులైన సురభి శేషశర్మ 1919 జనవరిలో కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలోనూ, ఆంధ్రమహాసభలోనూ కీలకపాత్ర పోషించారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలోకూడా ప్రముఖ పాత్ర వహించారు. 1944-51 కాలంలో జిల్లా కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1951లో వినోబాభావే సాగించిన భూదానోద్యమంలో పాల్గొని ఏడువేలకు పైగా ఎకరాల భూమిని ఇప్పించారు. 12 సంవత్సరాలు సర్వోదయ మండలి అధ్యక్షులుగా కొనసాగినారు.


విభాగాలు: పాలమూరు జిల్లా సమరయోధులు,  కల్వకుర్తి మండలము, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి