ఎక్లాస్ పూర్ మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.ప్రసిద్ధి చెందిన లోకపల్లి సంస్థానాధీశులు కట్టించిన ఔదుంబరేశ్వరాలయం ఇక్కడే ఉంది. ఈ గ్రామాన్ని ప్రవాస భారతీయులకు చెందిన జిందాల్ ఫౌండేషన్ వారు దత్తత తీసుకున్నారు. 2004-05లో రూ.20 లక్షలతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1512. ఇందులో పురుషులు 766, మహిళలు 746. గృహాల సంఖ్య 286. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1617. ఇందులో పురుషులు 830, మహిళలు 787. గృహాల సంఖ్య 350. అక్షరాస్యత శాతం 37.35%. గ్రామ కోడ్ సంఖ్య 575444. రాజకీయాలు: 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా తిమ్మప్ప ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి