సినీనటిగా పేరుపొందిన విద్యాబాలన్ జనవరి 1, 1979న ముంబాయిలో జన్మించింది. సినిమాలలో నటనకు ముందు వాణిజ్య ప్రకటనలలో, సీరియళ్ళలో నటించింది. 2005లో పరిణీతి ద్వారా మంచిపేరు సంపాదించింది. 2006లో లగేరహో మున్నాభాయి సినిమా హిట్ అయింది. హే బాబి, కిస్మత్ కనెక్షన్, పా, డర్టీ పిక్చర్స్ సినిమాలు విజయం సాధించాయి. సిల్క్స్మిత జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ డర్టి పిక్చర్లో నటనకుగాను విద్యాబాలన్కు జాతీయ ఉత్తమనటిగా పురస్కారం లభించింది.
తన సినీజీవితంలో మొత్తం 6 సార్లు ఫిలింఫేర్ అవార్డుపు పొందింది. 2014లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. విద్యాబాలన్ భర్త సిద్ధార్థరాయ్ కపుర్ సినీనిర్మాతగా పేరుపొందారు. 2017లో బాలన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ సభ్యురాలిగా పనిచేసింది. 2018లో బయోపిక్ "ఎన్టీయార్ కథానాయకుడు" సినిమాలో బసవతారకం పాత్రను పోషించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి