తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిసెంబరు 23, 1962న మలికిపురం మండలం అడవిపాలెంలో జన్మించారు. 2001లో రాజోలు జడ్పీటీసిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2006లో మలికిపురం జడ్పీటీసిగా ఎన్నికై జిల్లా పరిషత్తు చైర్మెన్ అయ్యారు. డిసిసి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. 2013లో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోట త్రిమూర్తులుపై విజయం సాధించారు. జూలై 2020లో వైఎస్సార్ కేబినెట్లో మంత్రిపదవి లభించింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి