బక్కని నరసింహులు మహబూబ్నగర్ జిల్లా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన 1983లో తెలుగుదేశం పార్ట్ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి 1994లో షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి పి.శంకర్రావుపై భారీ మెజారిటీతో విజయం సాధించి తొలిసారిగా శాసనసభలో ప్రవేశించారు. 1999లో సీట్ల సర్దుబాటులో ఈ స్థానం భాజపాకు వెళ్ళడంతో పోటీచేసే అవకాశం రాలేదు. 2004లో రెండోసారి పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు ఈయన ఎస్సీ, ఎస్టీ కమిటి రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటి సభ్యుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ తెలుగుదేశంప్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ తెరాసలో చేరడంతో జూలై 19, 2021న బక్కని నరసింహులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి