4, జనవరి 2015, ఆదివారం

జాతీయ వార్తలు 2015 (National News 2015)

జాతీయ వార్తలు 2015 (National News 2015)

ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2015ఆంధ్రప్రదేశ్ వార్తలు-2015అంతర్జాతీయ వార్తలు-2015క్రీడావార్తలు-2015

జనవరి 2015:
  • 2015, జనవరి 1: ప్రణాళికా సంఘం స్థానంలో "నీతి ఆయోగ్" అవతరించింది.
  • 2015, జనవరి 2: గుజరాత్‌లోని అకోదరలో ఐసిఐసిఐ డిజిటల్ గ్రామాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి జాతికి అంకితం చేశారు. 
  • 2015, జనవరి 3: 102వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సు ముంబాయిలో ప్రారంభమైంది. 
  • 2015, జనవరి 5: నీతి ఆయోగ్ తొలి వైస్-చైర్మెన్‌గా అరవింద్ పసగడియా నియమితులైనారు. 
  • 2015, జనవరి 5: శృంగేరి శారదా పీఠాధిపతిగా కుప్పూరు వెంకటేశ్వర ప్రసాద్ శర్మ నియమితులైనారు.
  • 2015, జనవరి 6: మేఘాలయ గవర్నరుగా కేసరినాథ్ త్రిపాఠి భాధ్యతలు స్వీకరించారు. 
  • 2015, జనవరి 6: బెంగాలి నటి రూపాగంగూలి భారతీయ జనతాపార్టీలో చేరారు. 
  • 2015, జనవరి 7: 13వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలు గాంధీనగర్‌లో ప్రారంభమైనాయి.
  • 2015, జనవరి 9: డిఎంకె అధ్యక్షుడిగా కరుణానిధి 11వ సారి ఎన్నికయ్యారు. 
  • 2015, జనవరి 9: జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించబడింది. 
  • 2015, జనవరి 13: ఇస్రో చైర్మెన్‌గా కిరణ్ కుమార్ అలూర్ సిలిన్ నియమితులైనారు. 
  • 2015, జనవరి 15: కిరణ్ బేడి భాజపాలో చేరారు. 
  • 2015, జనవరి 19: ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడి పేరును భాజపా ప్రకటించింది. 
  • 2015, జనవరి 19: సెన్సార్ బోర్డు కొత్త చైర్మెన్‌గా పహ్లాద్ నిహలాని నియమించబడ్డారు. 
  • 2015, జనవరి 23: శృంగేరి శారదా పీఠం అధిపతిగా విధుశేఖర స్వామి సన్యాసం స్వీకరించారు.
  • 2015, జనవరి 26: లాల్‌కృష్ణ అడ్వాణి, అమితాబ్ బచ్చన్‌లలతో పాటు 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పదంభూషణ్, 75 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. 
  • 2015, జనవరి 28: భారత మాజీ హాకీ ఆటగాడు జస్వంత్ సింగ్ మరణించారు. 
  • 2015, జనవరి 29: గూర్ఖాలాండ్ ఉద్యమ నాయకుడు సుభాష్ ఘీషింగ్ మరణించారు. 
  • 2015, జనవరి 29: సంగీత నాటక అకాడమీ చైర్మెన్‌గా శేఖర్ సేన్ నియమితులైనారు. 
ఫిబ్రవరి 2015:
  • 2015, ఫిబ్రవరి 1: రియాలిటి షో "బిగ్‌బాస్ హల్లాబోల్" విజేతగా గౌతం గులాటి నిలిచారు. 
  • 2015, ఫిబ్రవరి 4: జేకే గ్రూపు అధినేత గౌర్ హరి సింఘానియా మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 6: మరాఠి రచయిత బాలచంద్ర నెమడేకు 2014 సంవత్సరపు జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించబడింది. (జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీతల పట్టిక)
  • 2015, ఫిబ్రవరి 7: మహారాష్ట్రలోని సిరోంచ తాలుకా వడిదం అటవీప్రాంతంలో క్రీ.పూ.14-16 శతాబ్దికాలం నాటి అవశేషం బయటపడింది. 
  • 2015, ఫిబ్రవరి 9: మనదేశానికి చెందిన రికీకేజ్, నీలావిశ్వానీలకు గ్రామీ అవార్డు లభించింది.
  • 2015, ఫిబ్రవరి 10: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP (ఆమ్‌ ఆద్మీ పార్టీ) భారీ విజయాన్ని నమోదుచేసింది. 
  • 2015, ఫిబ్రవరి 13: బెంగుళూరు సమీపంలో ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి 8 మంది మరణించారు.
  • 2015, ఫిబ్రవరి 13: కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలో రెండో అత్యుత్తమ ప్రాజెక్టుగా ఎంపికైంది. 
  • 2015, ఫిబ్రవరి 16: ఎన్సీపీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 16: లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడిగా రాంవిలాస్ పాశ్వాన్ తిరిగి ఎన్నికయ్యారు. 
  • 2015, ఫిబ్రవరి 20: బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ రాజీనామ చేశారు. 
  • 2015, ఫిబ్రవరి 20: టోల్‌టాక్సుల వ్యతిరేఖ ఉద్యమ నేత గోవింద్ పన్సారే మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 22: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. (బీహార్ ముఖ్యమంత్రుల జాబితా) , (రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రులు)
  • 2015, ఫిబ్రవరి 24: కేంద్రపన్నులలో రాష్ట్రాల వాటా 42%కి పెంచాలని సిఫార్సు చేసిన 14వ ఆర్థిక సంఘం సూచనను కేంద్రం ఆమోదించింది. 
  • 2015, ఫిబ్రవరి 26: రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు లోకసభలో రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టారు.
  • 2015, ఫిబ్రవరి 28: ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 
 మార్చి 2015:
  • 2015, మార్చి 1: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ముఫ్తీమహ్మద్ ప్రమాణస్వీకారం చేశారు. (జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితా)
  • 2015, మార్చి 2: నాయుడమ్మ పురస్కారం టెస్సీ థామస్, గీతావరదన్‌లకు ప్రకటించబడింది.
  • 2015, ఫిబ్రవరి 2: బీసిసిఐ అధ్యక్షుడిగా జగ్‌మోహన్ దాల్మియా ఎన్నికయ్యారు. 
  • 2015, మార్చి 4: ఆప్ కన్వీనర్ పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. 
  • 2015, మార్చి 4: ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌లను పీఏసీ నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ తొలగించింది. 
  • 2015, మార్చి 5: కేంద్ర మంత్రిపదవికి రావుసాహెబ్ దాన్వే రాజీనామా చేశారు.
  • 2015, మార్చి 8: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ మెహతా మరణించారు. 
  • 2015, మార్చి 17: జాట్‌లను ఓబీసీ జాబితాలో చేరుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
  • 2015, మార్చి 20: యువతకు నైపుణ్యం ఇచ్చేందుకు కేంద్రం "ప్రధాన్‌మంత్రి కౌశల్ వికాస్ యోజన" పథకాన్ని ప్రారంభించింది. 
  • 2015, మార్చి 20: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లాలో ఘోర రైలుప్రమాదం జరిగి 45 మంది మరణించారు. 
  • 2015, మార్చి 20: విశ్వభారతి ఛాన్సలర్‌గా ప్రధాని నరేంద్రమోడి నియమితులైనారు. 
  • 2015, మార్చి 23: శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించబడింది. 
  • 2015, మార్చి 24: 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు:
    జాతీయ  ఉత్తమ చిత్రం: కోర్ట్ (మరాఠి),
    జాతీయ ఉత్తమ నటి: కంగనా రనౌత్ (క్వీన్),
    జాతీయ ఉత్తమ నటుడు: విజయ్ (కన్నడ),
    ఉత్తమ దర్శకుడు: శ్రీజిత్ ముఖర్జీ (బెంగాలీ),
    ఉత్తమ హిందీ చిత్రం: క్వీన్,
    ఉత్తమ తెలుగు చిత్రం: చందమామ కథలు
  • 2015, మార్చి 27: మిజోరాం మాజీ ముఖ్యమంత్రి బ్రిగ్‌సైలో మరణించారు. 
  • 2015, మార్చి 27: అటల్ బిహారి వాజపేయికి భారతరత్న పురస్కారం ప్రధానం చేయబడింది. 
  • 2015, మార్చి 27: ఇస్రోకు గాంధీ శాంతి బహుమతి-2014 ప్రకటించబడింది.
  • 2015, మార్చి 28: పీఎస్‌ఎల్‌వి సీ-27 షార్ నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది. 
  • 2015, మార్చి 28: మిజోరం గవర్నర్ అజీజ్ ఖురేషిని పదవి నుంచి తొలగించారు. పశ్చిమబంగ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి అదనపు బాధ్యతలు. 
  • 2015, మార్చి 30: రాష్ట్రపతిచే 9 గురికి పద్మవిభూషణ్, 29 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించబడింది. 
  • 2015, మార్చి 29: మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌చే రచించిన "ఇండియా శస్త్ర" పుస్తకం ఆవిష్కరించబడింది. 
  • 2015, మార్చి 29: మిస్ ఇండియా వరల్డ్-2015 గా ఢిల్లీకి చెందిన ఆదితి ఆర్య ఎంపికైంది. మొదటి రన్నరప్‌గా ఆఫ్రీన్ రేచల్, రెండో రన్నరప్‌గా వర్తికాసింగ్‌లు నిలిచారు.
  • 2015, మార్చి 29: భారతీయ జనతాపార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 ఏప్రిల్ 2015:
  • 2015, ఏప్రిల్ 1: భారతీయ రిజర్వ్ బ్యాంక్ 80 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 
  • 2015, ఏప్రిల్ 1: రూ. 12వేల కోట్లతో చేపట్టిన రూర్కెలా ఉక్కుకర్మాగారం విస్తరణ పనులకు ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.
  • 2015, ఏప్రిల్ 5: ప్రపంచ వ్యాప్తంగా 600 సందర్శనీయ ప్రాంతాలలో భారత్‌కు చెందిన 4 నగరాలు ఎంపికయ్యాయి. (జైపూర్, ఢిల్లీ, ముంబాయి, జైసల్మార్). 
  • 2015, ఏప్రిల్ 9: మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగివచ్చి 100 సంవత్సరాలు పూర్తయింది.
  • 2015, ఏప్రిల్ 18: కోల్‌కత నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. 
  • 2015, ఏప్రిల్ 21: ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి జె.బి.పట్నాయక్ మరణించారు. 
  • 2015, ఏప్రిల్ 22: చరణ్‌సింగ్ సమాధికి "జన్‌నాయక్" పేరు ఖరారు చేశారు.
  • 2015, ఏప్రిల్ 23: పశ్చిమబెంగాల్‌లో 6 పట్టణాలకు పేరుమార్చారు: సిలిగురి → తీస్తా, బోల్‌పూర్ → గీతాబితన్, అసన్‌సోల్, దుర్గాపూర్ → అగ్నిబినా, గాజోల్ దోబ → ముక్తతీర్థ, గరియా → ఉత్తమ్‌సిటి, కల్యాణి → సమృద్ధి.
  • 2015, ఏప్రిల్ 28: పశ్చిమబెంగాల్ పురపాలక సంఘం ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. 
  • 2015, ఏప్రిల్ 28: ఉత్తర ఢిల్లీ మేయర్ ఎన్నికలలో భాజపా విజయం సాధించింది. 
మే 2015:
  • 2015, మే 1: 10 లక్షల జనాభా మించిన నగరాలలో కూడా మెట్రో రైలును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు. 
  • 2015, మే 4: మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో బస్సు కాల్వలో పడి నిప్పు అంటుకొని 21 మంది సజీవ దహనం అయ్యారు.
  • 2015, మే 5: భారత సైన్యంలో ఆకాశ్ క్షిపణి ప్రవేశపెట్టబడింది. 
  • 2015, మే 7: కేంద్ర ఎన్నికల కమీషనర్‌గా ఎ.కె.జ్యోతి నియమితులైనారు. 
  • 2015, మే 11: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టులో జయలలితకు విముక్తి లభించింది. 
  • 2015, మే 18: జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ద్రౌపది ముర్ము పదవి స్వీకరించారు. 
  • 2015, మే 20: మేఘాలయ గవర్నరుగా షణ్ముగనాథన్ పదవి స్వీకరించారు. (అన్ని రాష్ట్రాల గవర్నర్లు)
  • 2015, మే 23: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారం చేశారు.(తమిళనాడు ముఖ్యమంత్రుల జాబితా)
  • 2015, మే 30: దేశీయ కరెన్సీ పేపర్ ఉత్పత్తి చేసే యూనిట్‌ను హోషంగాబాదు (మధ్యప్రదేశ్)లో ప్రారంభించబడింది.
  • 2015, మే 30: నలందా విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా సింగపూర్ మాజీ మంత్రి జార్జ్ యో నియమితులైనారు.
  • 2015, మే 31: 12.36% సేవాపన్ను (సర్వీస్ టాక్స్) స్థానంలో 14% సేవా పన్ను అమలులోకి వచ్చింది. 
జూన్ 2015:
  • 2015, జూన్ 1: అటల్ బిహారీ వాజపేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం "ఫ్రెండ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్" అవార్డు ప్రకటించింది. 
  • 2015, జూన్ 5: గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో హిందూయేతరల ప్రవేశంపై నిషేధం విధించారు. 
  • 2015, జూన్ 4: మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో 18 మంది జవాన్లు మరణించారు.
  • 2015, జూన్ 6: తెలుగు సినీనటి ఆర్తీ అగర్వాల్ మరణం. 
  • 2015, జూన్ 8: కేంద్ర విజిలెన్స్ కమీషనర్‌గా కేవీ చౌదరి నియమితులైనారు. 
  • 2015, జూన్ 11: భారతదేశంలో సంతోషకరమైన నగరంగా చండీగఢ్ ఎంపికైంది. 
  • 2015, జూన్ 12: రాక్‌గార్డెన్ రూపకర్త నేక్‌చంద్ మరణం.
  • 2015, జూన్ 13: భారత సంతతి వ్యక్తి హర్షద్ కుమార్ ధరంషికి బ్రిటీష్ రాణి నైట్ హుడ్ పురస్కారం లభించింది.
  • 2015, జూన్ 13: ఉత్తరప్రదేశ్‌లోని ఈటా సమీపంలో ఘోర రోడ్డుప్రమాదంలో 15 మంది మరణించారు. 
  • 2015, జూన్ 14: కేంద్ర మంత్రిగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన షీలాకౌల్ మరణించారు. 
  • 2015, జూన్ 17: ఆధునిక భారత రూపశిల్పిగా పేరుపొందిన చార్లెస్ కొరియర్ మరణం.
  • 2015, జూన్ 19: భారత శాస్త్రవేత్త సీఎన్ రావుకు జపాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. 
  • 2015, జూన్ 20: భారత్‌లో జన్మించిన నికేశ్ అరోరా జపాన్‌లోని సాహ్ట్‌బ్యాంక్ కార్పోరేషన్ అధిపతిగా నియమితులైనారు. 
  • 2015, జూన్ 23: మిషనరీస్ ఆఫ్ చారిటీస్ మాజీ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల మరణం. 
  • 2015, జూన్ 25: భారత అధ్యాత్మికవేత్త రవిశంకర్‌కు కొలంబియా ప్రభుత్వం అత్యున్నత అవార్డు ప్రధానం చేసింది.
  • 2015, జూన్ 25: ఫోర్బ్స్ విడుదల చేసిన "బెస్ట్ అండర్ విలియన్" జాబితాలో 11 భారతీయ సంస్థలకు చోటు దక్కింది.
  • 2015, జూన్ 25: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదంలో 20 మంది మరణించారు.
  • 2015, జూన్ 30: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్.నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించింది. 
జూలై 2015:
  • 2015, జూలై 1: 2014 సంవత్సరపు జిడి బిర్లా పురస్కారం సంజీవ్ గలండేకు ప్రకటించబడింది.
  • 2015, జూలై 4: వ్యాపం కుంభకోణంలో మరణాల సంఖ్య 45కు చేరింది. 
  • 2015, జూలై 7: కార్మికుల దినసరి కనీస వేతనాన్ని కేంద్రం రూ.160కి పెంచింది. 
  • 2015, జూలై 10: ఇస్రో PSLV C28 ఉపగ్రహనౌక ద్వారా బ్రిటన్‌కు చెందిన 5 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. 
  • 2015, జూలై 14: దక్షిణ భారతదేశ చలనచిత్ర సంగీతదర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ మరణం.
  • 2015, జూలై 14: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ళ నిషేధం విధిస్తూ లోధా లమిటి తీర్పు ఇచ్చింది. 
  • 2015, జూలై 27: భారత రాష్ట్రపతిగా పనిచేసిన ఏ.పి.జె.అబ్దుల్ కలాం మరణించారు. 
  • 2015, జూలై 29: సంజీవ్ చతుర్వేది, అన్షు గుప్తాలకు రామన్ మెగ్సేసే అవార్డులు లభించాయి.
  • 2015, జూలై 30: ముంబాయి బాంబు పేలుళ్ళ నేరస్థుడు యాకూబ్ మెమన్‌ను నాగ్పూర్‌లో ఉరితీశారు. 
  • 2015, జూలై 30: దేశీయ బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్‌ను ఫ్రాన్స్ బ్యాంకింగ్ సంస్థ బీఎన్‌పి పారిబస్ కొనుగోలు చేసింది.
ఆగస్టు 2015:
  • 2015, ఆగస్టు 1: మణిపూర్‌లో చాండెల్ జిల్లా జౌమోల్‌లో కొండచరియలు పడి 20 మంది మరణించారు.
  • 2015, ఆగస్టు 4: మధ్యప్రదేశ్‌లోని కుదువా రైల్వేస్టేషన్ సమీపంలో ఘోరరైలుప్రమాదం. 
  • 2015, ఆగస్టు 8: బీహార్ గవర్నరుగా శ్రీరాంనాథ్ కోవింద్, హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా ఆచార్య దేవవ్రత్ లు నియమించబడ్డారు. (అన్ని రాష్ట్రాల గవర్నర్ల కొరకు ఇక్కడ చూడండి) 
  • 2015, ఆగస్టు 8: జాతీయస్థాయిలో పరిశుభ్రతలో మైసూరు ప్రథమస్థానంలో నిలిచింది.
  • 2015, ఆగస్టు 10: ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబిద్ అలీ "హనుమాన్ చాలీసా"ను ఉర్దూలోకి అనువదించాడు.
  • 2015, ఆగస్టు 11: జార్ఖండ్‌లో దియోగఢ్‌లోని దుర్గామాత ఆలయంలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. 
  • 2015, ఆగస్టు 11: గూగుల్ సీఈఓగా భారతీయుడైన సుందర్ పిచ్చై పేరు ప్రతిపాదించబడింది.
  • 2015, ఆగస్టు 15: ముకుంద్ వరదరాజన్‌కు మరణానంతరం అశోకచక్ర లభించింది. 
  • 2015, ఆగస్టు 20: రాజస్థాన్ పురపాలకసంఘ ఎన్నికలలో భాజపా అత్యధిక స్థానాలు పొందింది. 
  • 2015, ఆగస్టు 25: మతాల వారీగా జనాభా గణాంకాలను రిజిస్ట్రార్ అండ్ సెన్సెస్ కమీషనర్ విడుదల చేశారు. 
  • 2015, ఆగస్టు 28: ఢిల్లీలో ఔరంగాజేబు రహదారికి అబ్దుల్ కలాం రహదారిగా పేరుమార్చాలని ఢిల్లీ నగరపాలక సంస్థ నిర్ణయించింది. 
  • 2015, ఆగస్టు 30: కన్నడ సాహితీవేత్త, హంపి విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఎం.ఎం.కల్బుర్గి హత్యకు గురయ్యారు.
సెప్టెంబరు 2015:
  • 2015, సెప్టెంబరు 4: ఒరిస్సాలోని భద్రక్ జిల్లాలోని వీలర్ ఐలాండ్ పేరును "అబ్దుల్ కలాం ఐలాండ్"గా మార్చబడింది. 
  • 2015, సెప్టెంబరు 4: జాతీయ హ్యుమానిటీస్ పురస్కారం-2014 ఝంపాలాహిరికి లభించింది.
  • 2015, సెప్టెంబరు 6: దేశ సాంస్కృతిక గణాంక నిధి తయారీకి కేంద్రం చర్యలు చేపట్టింది. ("భారత్ కా సాంస్కృతిక్ మన్ చిత్రన్" పేరిట)
  • 2015, సెప్టెంబరు 9: 2014 సంవత్సరపు గాంధీ శాంతి బహుమతిని ఇస్రోకు ప్రధానం చేశారు. 
  • 2015, సెప్టెంబరు 9: DRDO డైరెక్తర్ జనరల్‌గా జె.మంజుల నియమితులైనారు. (ఈ పదవి పొందిన తొలి మహిళ్) 
  • 2015, సెప్టెంబరు 9: బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. 
  • 2015, సెప్టెంబరు 9: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మెన్‌గా శశిధర్ సిన్హా నియమితులైనారు. 
  • 2015, సెప్టెంబరు 11: బెంగుళూరు నగరపాలక సంస్థ మేయరు స్థానం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.
  • 2015.సెప్టెంబరు 16: గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని పూరించడానికి "శ్యామా ప్రసాద్ ముఖర్జీ రర్బర్" మిషన్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం. 
  • 2015, సెప్టెంబరు 19: టీవీ రాజేశ్వర్ రచించిన :ది క్రూషియల్ ఇయర్స్" పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు.
  • 2015, సెప్టెంబరు 20: బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా మరణం.
  • 2015, సెప్టెంబరు 25: విలాసవంతమైన మహారాజ రైలుకు సెవెన్ స్టార్ లక్జరీ పురస్కారం లభించింది. 
అక్టోబరు 2015:
  • 2015, అక్టోబరు 6: INS అస్త్రధారిణి నౌక జాతికి అంకితం చేయబడింది.

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014,

Telugu News, తెలుగు వార్తలు,Indian News in telugu, National news in telugu, current affairs in telugu, burning news in telugu, latest news in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక